Posts

తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ పనితీరుపై అసంతృప్తి

Image
  తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ పనితీరుపై అసంతృప్తి  చిన్న ఉద్యోగులనే టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు  వరుస దాడుల్లో నలభైకి పైగా ఫాల్స్ కేసులు తేలినట్లు సమాచారం  శాఖ తీరుపై సీఎం ద్రుష్టి పెట్టాలంటున్న ప్రభుత్వ ఉద్యోగులు. - ప్రభుత్వ పరిధిలో జితా భత్యాలు తీసుకొనే వారందరికి అవినీతి నిరోధక శాఖ అంటే భయం. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పవర్ లోకి వచ్చాక ఏసీబీ అధికారులు కాస్త స్పీడ్ పెంచారనే చెప్పాలి. పంచాయితీరాజ్ , ఇరిగేషన్ , ఆర్ అండ్ బీ , విద్యుత్ శాఖ లాంటి వాటిపై ద్రుష్టి పెడుతున్న ఏసీబీ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ , పలువురు ఉన్నతాధికారులు ,( ఐఏఎస్ , ఐపీఎస్ ) లతో పాటు పలువురు రాజకీయ నాయకులపై కూడా ద్రుష్టి సారిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చిన్న చితక ఉద్యోగులనే టార్గెట్ చేయడం వల్ల ఎంప్లాయిస్ లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో ఏసీబీ లో కొంతమంది అధికారుల అత్యుత్సహం సర్కార్ ను ఇరకాటంలో పెట్టెలా చేస్తుంది. రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగిన చర్యలు తీసుకుంటమని చెప్తున్నా అనిశా వందల ఫైళ్లు పెండింగ్ లో పెట్టె కొంతమంది ఐఏఎస్ ల మీద...

తెలంగాణలో రిటైర్డ్ అధికారుల హావ

Image
  తెలంగాణలో రిటైర్డ్ అధికారుల హావ నడుస్తోంది. ఉన్నత శాఖల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారు చాల మంది అలానే ఉన్నారు. మరి ముఖ్యంగా 12 వందల మంది జేఈ లు ఉండాలి కానీ కేవలం రెండు వందల మంది మాత్రమే ఉన్నారు. ఆర్ అండ్ బి శాఖలో కీలకంగా ఉన్న శ్రీనివాస రాజు వచ్చాక పరిస్థితి బాగాలేదన్నా ఆరోపణలు ఉన్నాయి. రిటైర్డ్ అయిన ఎక్స్టెన్షన్ రావడం తో కూల్ గా ఉంటున్నారు. మెడికల్ అండ్ హెల్త్ , ఆర్ అండ్ బి తో పాటు ఎడ్యుకేషన్ లాంటి కీలక శాఖలల్లో ఉన్న ఆయన నేరుగా ఈరోజు ముఖ్య మంత్రి తో సమీక్షా చేయలేదు. ఆర్ అండ్ బి పరిస్థితి దారుణంగా ఉంది. ఈఎన్సీ గా ఉన్న జయ భారతి పనితీరు సరిగా లేదు.స్టేట్ రోడ్ల తీరుపై ఫీడ్ బ్యాక్ బాగుంది.ఒక రిటైర్డ్ అధికారికి సీఎంఓ లో ఉన్నత పదవి వచ్చిన ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే అయన ఏపీకి చెందిన వాడు. ఇటీవల కాలంలో ఏపీకి నితిన్ గడ్కారీ విసిట్ చేసిన సమయంలో పది ప్రాజెక్టులు అడిగితె అందులో ఐదు ఒకే చేసారు.కానీ తెలంగాణలో సరైన అధికారులు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేయలేకపోతున్నారు.సరిగా పనిచెసే ఆఫీసర్లు ఒక్కరు లేరన్న విమర్శలు ఉన్నాయి....

ఆర్ అండ్ బి శాఖలో మంత్రి కోమటి రెడ్డి టాప్

Image
రోడ్ల మరమ్మతులకు 100 కోట్లు అవసరం హ్యామ్‌ కింద 4వేల కి.మీ రోడ్ల పునరుద్ధరణ ఆర్‌ఆర్‌ఆర్‌ బాధితులకు పరిహారం చెల్లించండి హ్యామ్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (హ్యామ్‌)లో ఎక్కువ ట్రాఫిక్‌ ఉన్న రోడ్లకే ప్రాధాన్యమివ్వాలని రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు.ఇటీవల హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌లోని ఆర్‌ అండ్‌ బీ కేంద్ర కార్యాలయంలో హ్యామ్‌పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్న రోడ్లనే ఈ ప్రాజెక్టు కిందకు తీసుకోవాలని సూచించారు. హ్యామ్‌ కింద చేపట్టే రోడ్లు గ్రామీణ ప్రాంతాలకు అనుసంధాన కారిడార్లుగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురై వెనుకబడిన జిల్లాలకు హ్యామ్‌లో మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులకు కొత్తగా భూ సేకరణ అవసరం లేదని, ప్రస్తుతమున్న రోడ్లనే ఒక వరుస నుంచి రెండు వరుసలుగా విస్తరిస్తామని చెప్పారు. దాదాపు 4 వేల కి.మీ రోడ్లను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వివరించారు. ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్ల ...

పంచాయితీ రాజ్ శాఖలో షాడో మంత్రి.

Image
  పంచాయితీ రాజ్ శాఖలో రోజుకో అంశం వివాదాస్పదమౌతోంది.మంత్రి దగ్గర పనిచేసే సిబ్బంది వ్యవహర శైలితో శాఖ ప్రతిష్టదిగజారుతోంది.తద్వారా  మంత్రికి చెడ్డ పేరు వస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.మంత్రి దగ్గర పనిచేసే పిఎపై మంత్రి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తుంది.మంత్రి సీతక్క ను రాంగ్ గైడ్ చేస్తు పంచాయితీ రాజ్ శాఖను గందరగోళం లో పడేస్తున్నారు.సింగరేణి నుండి డిప్యూటేషన్ మీద వచ్చి షాడో మంత్రిగా చలామణి అవుతున్నారని శాఖాపరమైన ఉద్యోగులు చెప్తున్నారు.మహిళ ఉద్యోగినులను టార్గెట్ చేస్తు ఇష్టారీతిగా ట్రాన్ఫర్స్ను చేస్తున్న పట్టించుకొనే వారు లేరని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తాగాజా సెక్రెటరియేట్ లో పనిచేస్తున్న ఓ మహిళ ఉద్యోగిని ఆకారణంగా అక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేయించారని ఇది ఏంటని అడిగితె నేను మంత్రి పిఎను అన్ని తన కనుసన్నుల లోనే నడుస్తాయని దబాయించినట్లు సమాచారం.ఇసుక , ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ ఫేర్ , పంచాయితీ రాజ్ , పీఎంజిఎస్ వై డిపార్ట్మెంట్ లలో భారీగా కమిషన్లు మంత్రి పేరు చెప్పి వాసులు చేస్తున్నారట. గతంలో సింగరేణి లో తనకంటు ఓ బలమైన వర్గం ఉండేది ఇప్పుడు మంత్రి సీతక్క దగ్గర అంతే ఉంటుందన...

రాజ గోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్

Image
మునుగోడు ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మంత్రి పదవి విషయంలో తీవ్ర అసంతృప్తి మీదున్న రాజ గోపాల్ రెడ్డికి త్వరలో బెర్త్ కన్ఫమ్ కానున్నట్లు వినికిడి.రెండు సార్లు ఎంపి , ఒకసారి ఎమ్మెల్సీ , రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచినా రాజ గోపాల్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేతగా గుర్తింపు పొందారు.మధ్యలో కమలం గూటికి వెళ్లి భంగపాటు అయన బీజేపీ నుండి మల్లి కాంగ్రెస్ లోకి వచ్చారు.రాజ గోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి , పలువురు కాంగ్రెస్ ఇంచార్జిలు హామీ ఇవ్వడం హస్తం గూటికి చేరి స్వపక్షం లో విపక్షం లాగా మారారు.రేవంత్ మాట పై నమ్మకం లేదంటు వరుసగా అయన అసంతృప్తిని బయట పెడుతున్నారు.కాంగ్రెస్ పవర్ లోకి రావడం కోసం తనవంతు కృషి చేసిన రాజ గోపాల్ కు మొండి చేయి చూపించి అయన సోదరుడు వెంకట్ రెడ్డికి కేబినెట్ లో అవకాశం ఇచ్చారు.ఎంపీ ఎన్నికల్లో భువనగిరి సిటు విజయం కోసం పని చేసిన గుర్తింపు కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉండటం మునుగోడు ప్రజలకు నచ్చడం లేదట.కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ సిటు విజయం కోసం రాజ గోపాల్ రెడ్డి తీవ్రంగా కృషి చేసారు.ఇక నిదుల విషయానికి వస్తే కొడంగల్ మాద...

హెచ్ఎండిఏ హార్టికల్చర్ లో భారీగా అవినీతి తిమింగలాలు

Image
  హెచ్ఎండిఏ హార్టికల్చర్ లో భారీగా అవినీతి తిమింగలాలు 13 కోట్ల కుంభకోణం జరిగినట్లు సమాచారం  పట్టించుకోని హెచ్ఎండీఏ కమిషనర్  - గ్హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని హార్టికల్చర్ లో భారీగా అవినీతి జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని కొంతమంది అధికారులు అక్రమంగా అడ్డా దారిలో పోగేసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హార్టీకల్చర్ మొక్కల టెండర్లు , వర్క్స్ విషయంలో కింది స్థాయి సిబ్బంది దాదాపు పదమూడు కోట్ల వరకు స్కామ్ చేసినట్లు సమాచారం. దీనిమీద కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ద్రుష్టి పెట్టడం లేదని అంటున్నారు. ముఖ్య మంత్రి నేరుగా ద్రుష్టి పెట్టకపోవడం వల్లనే ఇలా విచ్చల విడిగా ప్రజా ధనం దుర్వినియోగం అవుతుంది అంటున్నారు. దీని పరిధిలో పనిచేసే ఐఎఫ్ఎస్ అధికారి ప్రసాద్ కు ఉద్యోగులతో సమన్వయం లేకపోవడమే అసలు కారణం అంటున్నారు. ఇందులో తవ్విన కొద్దీ భారీ స్కామ్ బయట పడే అవకాశాలు ఉన్నాయట. అందుకోసం దీనిమీద ఎన్ఫోర్స్మెంట్ , విజిలెన్స్ , ఏసిబి లాంటి కీలక డిపార్ట్మెంట్లు ద్రుష్టి పెడితే ప్రజా ధనాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు అంటున్నారు సామాన్య జనం.

హెచ్ఎండిఏ హార్టికల్చర్ లో భారీగా అవినీతి తిమింగలాలు

Image
హెచ్ఎండిఏ హార్టికల్చర్ లో భారీగా అవినీతి తిమింగలాలు 13 కోట్ల కుంభకోణం జరిగినట్లు సమాచారం పట్టించుకోని హెచ్ఎండీఏ కమిషనర్ గ్హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని హార్టికల్చర్ లో భారీగా అవినీతి జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని కొంతమంది అధికారులు అక్రమంగా అడ్డా దారిలో పోగేసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హార్టీకల్చర్ మొక్కల టెండర్లు , వర్క్స్ విషయంలో కింది స్థాయి సిబ్బంది దాదాపు పదమూడు కోట్ల వరకు స్కామ్ చేసినట్లు సమాచారం. దీనిమీద కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ద్రుష్టి పెట్టడం లేదని అంటున్నారు. ముఖ్య మంత్రి నేరుగా ద్రుష్టి పెట్టకపోవడం వల్లనే ఇలా విచ్చల విడిగా ప్రజా ధనం దుర్వినియోగం అవుతుంది అంటున్నారు. దీని పరిధిలో పనిచేసే ఐఎఫ్ఎస్ అధికారి ప్రసాద్ కు ఉద్యోగులతో సమన్వయం లేకపోవడమే అసలు కారణం అంటున్నారు. ఇందులో తవ్విన కొద్దీ భారీ స్కామ్ బయట పడే అవకాశాలు ఉన్నాయట. అందుకోసం దీనిమీద ఎన్ఫోర్స్మెంట్ , విజిలెన్స్ , ఏసిబి లాంటి కీలక డిపార్ట్మెంట్లు ద్రుష్టి పెడితే ప్రజా ధనాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు అంటున్నారు సామాన్య జనం.