ఈనెలఖరుతో ముగియనున్న శాంతి కుమారి పదవి కాలం
తనకే అవకాశం వస్తుందంటున్న శాంతి కుమారి
లిస్ట్ లో రామ కృష్ణ రావు , వికాస్ రాజ్ , నవీన్ మిట్టల్ లు
ఈనెలఖరుతో ముగియనున్న శాంతి కుమారి పదవి కాలం
తనకే అవకాశం వస్తుందంటున్న శాంతి కుమారి
లిస్ట్ లో రామ కృష్ణ రావు , వికాస్ రాజ్ , నవీన్ మిట్టల్ లు
ఆ బ్రాండెడ్ దుస్తులే కావాలట
ఎంపీలు , ఎమ్మెల్యేలకు రిపోర్టర్ సిఫార్స్.
విలేఖరి వైఖరితో అవాక్కవుతున్న పార్టీ నేతలు.
ఈ మధ్య కాలంలో జర్నలిజంలోకి రావడం కొంతమందికి ఫ్యాషన్ అయిపొయింది.వృత్తి రీత్యా ఒకప్పుడు ఉన్న నిబద్దత ఎక్కడ కనిపించడం లేదు.విలేఖరీ అంటే ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వలను అలెర్ట్ చేసేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రెగ్యులర్ గా ఆయా డిపార్ట్మెంట్ లతో పాటు పొలిటికల్ పార్టీ బీట్ చూసే వాళ్ళ వ్యవహార శైలీ జుగుప్సా కారణంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.తాజాగా *కట్నం తీసుకొనే వాడు గాడిద* అంటూ ఉదర గొట్టే ఓ ప్రముఖ ఛానెల్ లో పనిచేసే రిపోర్టర్ తీరు అందరిని విస్మయానికి గురి చేస్తున్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు , ఎనిమిది మంది ఎంపీలు ఉన్న ఆ పార్టీకి సదరు రిపోర్టర్ గా పనిచేసే వ్యక్తి ఉత్తర తెలంగాణ నుండి ఎమ్మెల్యేగా గెలిచినా నేతతో పాటు దక్షిణ తెలంగాణ నుండి ఎంపీగా గెలిచిన సీనియర్ నేతను తనకు *రేర్ ర్యాబిట్* బ్రాండెడ్ దుస్తులను కొనివ్వలని వెంటపడుతున్నట్లు తెగ ప్రచారం నడుస్తోంది.గతంలో ఢిల్లీలో పనిచేసినప్పుడు లీడర్లు అందరు తమను ఫైవ్ స్టార్ హోటళ్లు , రెస్టారెంట్లకు, షాపింగ్ లకు తీసుకెళ్లే వారని కానీ హైదరాబాద్ లో పనిచేస్తే అలాంటి వేసులుబాటే లేదని బాధపడుతున్నడట. మార్కెట్ లో ఇలాంటి విలేఖర్లు కూడా ఉంటారా అని చెవులు కోరుకుంటున్నారట వినేవారు. అయితే ఈ విషయం పనిచేసే చోట ఉన్న వాళ్ళకు తెలుసా లేక తెలిసే ఉరుకుంటున్నారా అన్న ప్రచారం అయితే సాగుతోంది.
ఆ శాఖలో చక్రం తిప్పుతున్న అధికారి
తప్పుడు ప్రమోషన్లు తోసుకొని పదోన్నతులు
ప్రభుత్వాలు మరీనా ఇతను చెప్పిందే వేదం.
దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఏడువేల మంది ఉద్యోగులకు ఇబ్బందికరంగా అధికారి తీరు.
తెలంగాణ లో ఏడాది పాలనపై ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో కొన్ని శాఖల్లో ఉన్నత పదవుల్లో చలామణీలో ఉంటున్నారు ఆఫీసర్లు.తప్పుడు ప్రమోషన్లతో పదోన్నతులు పొంది కింది స్థాయి ఉద్యోగులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారన్నా అపవాదు ఉంది. లేటేస్ట్ గా ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ లో కృష్ణా రావు అనే అధికారి పై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.గత టీఆరెస్ ప్రభుత్వంలో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఆలయంలో విధులు నిర్వర్తించారు. అక్కడ నుండి కేవలం ఆరు నెలల వ్యవధిలో తన అధికార బలాన్ని వినియోగించి హైదరాబాద్ కు స్పెషల్ జీవో తో బదిలీ చేయించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దిరగానే కొండగట్టు కు ట్రాన్స్ఫర్ పై వెళ్లారు. 2025 జనవరి లో మల్లి బదిలీ పై నగరంలో గణేష్ టెంపుల్ కు వచ్చారు.ఇలా అతను అనుకున్నదే తడువు నచ్చిన చోట పోస్టింగ్ తెచ్చుకుంటూ అర్హత ఉన్న మిగత వాళ్లకు నష్టం చేకూరుస్తున్నారు. ఇతని వల్ల 2006- 2007 పదోన్నతుల సీనియారిటీ అంశంలో వివాదం ఉంది. తద్వారా ఈవో గ్రేడ్ వన్ అధికారులు , మప్సీల్ సూపరిండెంటెండ్ స్టాఫ్ , ఏ ఈ ఓ లు చాల మంది నష్టపోతున్నారు. సీనియార్టీ లిస్టులో నలుగురు అడిషనల్ కమిషనర్ స్థాయి అధికారులు తమ ప్రమోషన్లను కోల్పోతున్నారు. గతంలో జూపల్లి కృష్ణా రావు , పొన్నాల లక్ష్మయ్య లాంటి సీనియర్ లీడర్ల వద్ద పిఎ గా చేసిన అనుభవంతో డిపార్ట్మెంట్ లో చక్రం తిప్పుతున్నారట. ఎలాంటి ప్రమోషన్ లు లేకుండా అడిషనల్ కమిషనర్ స్థాయికి రావడం వెనక తన సామజిక వర్గం , రాజకీయ పలుకుబడే కారణం అని మిగతా ఉద్యోగులు వాపోతున్నారు. అర్హత ఉండి కూడా తమకు న్యాయం జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారంలో ఎవరు ఉన్న తనకు ఉన్న పలుకుబడి తో ఏడు వేల మంది ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపైన సంబంధిత శాఖ మంత్రి సెక్రెటరీకి చెప్పిన ఫలితం లేదు. మరోసారి మంత్రి ద్రుష్టి సారించాలని కోరుతున్నారు ఎంప్లాయిస్. గడిచిన సారి మంత్రి జూపల్లి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారట. ఓ కేసు విషయంలో హై కోర్ట్ మొట్టి కాయలు వేసింది. శాఖ కమిషనర్ , అడిషనల్ కమిషనర్ పని చేసి బదిలీ పై వెళ్లిన మహిళ అధికారి అండదండలతో భారీగా ఆస్తులు కూడా బెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై విజిలెన్స్ , ఎసిబి ద్రుష్టి పెట్టాలని మిగతా ఉద్యోగులు చెప్తున్నారు. 13 ఏళ్ళుగా కింది స్థాయి వాళ్ళకు తీవ్రంగా ఇబ్బంది కరంగా మారడంతో సీఎం ను కలిసి విన్నవించాలని భావిస్తున్నారు. తన ఉద్యోగం విషయంలో ఏదైనా సమస్య వస్తే సుప్రీం కోర్ట్ లో ఖరీదైన లాయర్లతో పిటిషన్ లు వేసే వారని తెలుస్తోంది. దీనిపైనా సుప్రీం కోర్ట్ సీరియస్ అయిందట.
ఆర్అండ్ బి శాఖలో అవినీతి.
ఈఎన్సీ పై ఆరోపణలు.
ఇష్టా రాజ్యాంగ వ్యవహారం.
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న కొన్ని శాఖల్లో అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో సగానికి పైగా అమలు కావడం లేదన్న ఆరోపణలు మురురుతున్న నేపత్యంలో ఆఫీసర్ల తీరు మరింత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుంది.అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దగ్గర పడుతున్న వేళ బాధితులకు న్యాయం జరగడం లేదన్న అపవాదు ఉంది.దానికి తోడు ఆర్ అండ్ బీ లాంటి కీలక శాఖల్లో ఉన్నతాధికారుల వ్యవహార శైలిపై సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.రోడ్డు & భవనాల శాఖలో సెక్రెటరీ తో పాటు ఈఎన్సీలపై అవినీతి , ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వం కీలక శాఖల మీద ద్రుష్టి పెట్టాలన్న డిమాండ్ వినిపిస్తుంది. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రజా రంజక పాలనా అందివ్వాలని భావిస్తుంటే ఇందుకు అధికారులు బిన్నంగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికైనా సీఎం ద్రుష్టి పెడితే శాఖ బాగుపడుతుందని అభిప్రాయపడుతున్నారు.
ఒకే వ్యక్తికీ ఐదు పోస్టులు
ఆ శాఖలో తిరుపై గుసగుసలు
ముఖ్య మంత్రి సోదరుని సిఫార్స్ తో చక్రం తిప్పుతున్న వైనం
ఐదు కీలక పోస్టులన్నీ ఒకే వ్యక్తి చక్కబెట్టడం తో మిగతా సీనియర్లకు అన్యాయం
అసలు అర్హత కలిగిన వాళ్లకు నష్టం అంటున్న సంబంధిత డిపార్ట్మెంట్ల ఉద్యోగులు.
ప్రజా పాలనలో అండదండలు ఉన్నవారివే అధికారం అన్న విదంగా తయారైంది పరిస్థితి. అర్హత లేకున్నా పైనున్న వారి ఆశిస్యులు ఉంటె చాలు ఒకే వ్యక్తిక్తి ఐదేసి పోస్టులు ఇచ్చే పరిస్థితి నెలకొంది. అందులో తెలంగాణ వారినీ కాదని ఆంధ్ర ప్రాంత ఉద్యోగులను అందలం ఎక్కిస్తున్నారన్న అపవాదు ఎదురు అవుతోంది. తాజాగా జీహెచ్ ఎంసీ పబ్లిక్ హెల్త్ లో ఇంచార్జి ఈ ఎన్ సీ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సదరు అధికారి భాస్కర్ రెడ్డి అదనంగా మరో నాలుగు శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాయలసీమ కు చెందిన ఈ అధికారికి ముఖ్య మంత్రి సోదరుని అండదండలతో ఏకంగా ఐదు పోస్టులు కలిగి ఉండటం తెలంగాణ ఉద్యోగ వర్గాల్లో కలవరం సృష్టిస్తుంది. తనకన్నా సీనియర్లకు అన్ని అర్హతలు ఉన్న కులం కార్డు వాడి ఇంచార్జి గా పదవి తెచ్చుకున్నారని వినికిడి. ఈఎన్సీ పబ్లిక్ హెల్త్ ఇంచార్జి తో పాటు సీఈ ( చీఫ్ ఇంజనీర్ ) ప్రాజెక్టు , సీఈ ( చీప్ ఇంజనీర్ ) మెయింటనెన్స్ , ఏస్ఈ ( సూపర్ఇండెంటెండ్ ఆఫ్ ఇంజనీర్ ) స్టాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం, సీఈ ( చీప్ ఇంజనీర్ ) హోసింగ్ అండ్ అడ్మినిస్టేషన్ కు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇన్ని పదవులు ఒకే వ్యక్తికీ కేటాయించడం ఏంటని అందరూ నోరు వేళ్ళ వెడుతున్నారు. దీనిమీద సంబండింత శాఖల సీనియర్ ఐఏఎస్ లు స్పందించాలన్న డిమాండ్ వస్తుంది. టప్పాల్ కూడా సరిగా చూడటం లేదన్న విమర్శలు ఉన్నాయి. జీహెచ్ ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ద్రుష్టి సారించాలని కొరుతున్నారు బాధితులు.ఇలంబర్తి ఎంతో కష్టపడుతున్న ఇలాంటి అధికారుల తీరు వల్ల డిపార్ట్మెంట్ కు చెడ్డా పేరు వస్తుందని అంటున్నారు.