Posts

ఒకే వ్యక్తికీ ఐదు పోస్టులు

  ఒకే వ్యక్తికీ ఐదు పోస్టులు              ముఖ్య మంత్రి సోదరుని సిఫార్స్ తో చక్రం తిప్పుతున్న వైనం  ఐదు కీలక పోస్టులన్నీ ఒకే వ్యక్తి చక్కబెట్టడం తో మిగతా సీనియర్లకు అన్యాయం  అసలు అర్హత కలిగిన వాళ్లకు నష్టం అంటున్న సంబంధిత డిపార్ట్మెంట్ల ఉద్యోగులు ప్రజా పాలనలో  అండదండలు ఉన్నవారివే అధికారం అన్న విదంగా తయారైంది పరిస్థితి. అర్హత లేకున్నా పైనున్న వారి ఆశిస్యులు ఉంటె చాలు ఒకే వ్యక్తిక్తి ఐదేసి పోస్టులు ఇచ్చే పరిస్థితి నెలకొంది. అందులో తెలంగాణ వారినీ  కాదని ఆంధ్ర ప్రాంత ఉద్యోగులను అందలం ఎక్కిస్తున్నారన్న అపవాదు ఎదురు అవుతోంది. తాజాగా జీహెచ్ ఎంసీ పబ్లిక్ హెల్త్ లో ఇంచార్జి ఈ ఎన్ సీ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సదరు అధికారి భాస్కర్ రెడ్డి  అదనంగా మరో నాలుగు శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాయలసీమ కు చెందిన ఈ అధికారికి ముఖ్య మంత్రి సోదరుని అండదండలతో ఏకంగా ఐదు పోస్టులు కలిగి ఉండటం తెలంగాణ ఉద్యోగ వర్గాల్లో కలవరం సృష్టిస్తుంది. తనకన్నా సీనియర్లకు అన్ని అర్హతలు ఉన్న కులం కార్డు వాడి ఇంచార్జి గా పదవి తెచ్చుకున్నారని వినికిడి. ఈఎన...

మంత్రి సీతక్క శాఖ లో కమిషన్ల అధికారి

Image
సచివాలయంలో కమిషన్ల అధికారి  ఫైళ్లు కదలాలంటే ముడుపులు అందాల్సిందే  పంచాయితీ రాజ్ శాఖలో  నిత్యం అదే పని  డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ సెక్రెటరిలో హోదాలో చక్రం తిప్పుతున్న వైనం - తెలంగాణ సచివాలయంలో ఓ అధికారి తీరు అందరిని విస్మయానికి గురి చేస్తుందని తెలుస్తోంది.తాను పని చేస్తున్న శాఖలో అసిస్టెంట్ సెక్రెటరీలో హోదాలో విధులు వెలగబెడుతున్న సదరు అధికారి వ్యవహార శైలిపై జోరుగా చర్చ నడుస్తోందట. పంచాయితీ రాజ్ శాఖలో పిఆర్ టప్పాల్ కు వచ్చే ఫైళ్లను ముందుగానే ట్రాక్ చేసి బాధితుల నుండి డబ్భులు వసూలు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.రాష్ట్ర వ్యాప్తంగా డిపార్టుమెంట్ పరిధిలో వివిధ సర్వీస్ మ్యాటర్ లలో నెలకొన్న ఇబ్బందులు ,ట్రాన్స్ఫార్లు, డిప్యూటేషన్లు , పదోన్నతులపై అసిస్టెంట్స్ సెక్రెటరిలో ఉన్న అధికారి దగ్గరకు వస్తుంటారు. పంచాయితీ రాజ్ శాఖ లో కీలక పోస్టులైన ఎండిఓ, డిపిఓ, జెడ్పి డిప్యూటీ సీఈఓ, సీఈఓ ల సర్వీస్ మ్యాటర్ లు అన్ని ఉంటాయి.వీరందరు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుండి ఉంటారు.అయితే పనుల నిమిత్తం వస్తున్నా వారిని వారి ఫైళ్లకు సంబందించిన సమాచారాన్ని ముందుగానే తెలియజేసి పై అధికార...

తెలంగాణ సచివాలయంలో కొత్త సంప్రదాయం.

Image
  తెలంగాణ సచివాలయంలో కొత్త సంప్రదాయం . బదిలపై వెళ్తున్న ఐఏఎస్ లందరు పాత స్టాప్ ను వెంట పెట్టుకొని వెళ్తున్న వైనం. శాఖ నుండి శాఖకు మారిన అదే తంతు.  అధికారుల కోటరీగా పలువురు పీఎస్ లు , ఓఎస్డీలన్న ప్రచారం. ఐఏఎస్ లు ఏ శాఖల్లో ఉన్న వీళ్లదే హవా.  - తెలంగాణ సెక్రటరియట్ లో కొత్త సాంప్రదాయం తెరమీదకు వచ్చింది.ఇప్పటి వరకు పొలిటికల్ లీడర్లకే పరిమితం అయిన ఈ సాంప్రదాయం ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారులకు పాకింది. సాధారణంగా ఐఏఎస్ అధికారులు శాఖలు మారడం సర్వసాధారణం.ప్రతీ రెండేళ్లకు ఒకసారి శాఖ మార్పు ఖచ్చితంగా ఉంటుంది.గత పాలనలో ఒకే శాఖలో అధికారులు ఏళ్ల తరబడి పనిచేశారు.ఆయా శాఖలకు ప్రినిసిపాల్ సెక్రెటరిలు ,సెక్రటరీలుగా పని చేసిన ఐఏఎస్ ల దగ్గర ఉన్న ఓఎస్డీ లు ,పీఎస్ లు తమ ఆఫీసర్లు ఎక్కడకు బదిలీపై వెళితే వారు కూడా అక్కడకే వెళ్తున్నారట. దింతో పలువురు సీనియర్ల దగ్గర పనిచేసే అవకాశం తమకు రావడం లేదని మిగతా ఉద్యోగులు మదన పడుతున్నట్లు చర్చ జరుగుతుంది.దింతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారులపై ప్రభుత్వ పెద్దలు విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ప్రభుత్వ రహస్యాలను గత ప్రభుత్వ పెద్దలకు చేరవేస్...

ఫైనాన్స్ సెక్రటరీ పనితీరు భేష్

Image
ఫైనాన్స్ సెక్రటరీ పనితీరు భేష్              కొత్త బాస్ పని తిరుపై ఉద్యోగుల సంతృప్తి                                                       గతం కంటే పర్వాలేదంటున్న ఎంప్లాయిస్.                                                      వెంట వెంటనే బిల్లులకు మోక్షం తెలంగాణ ప్రభుత్వ యంత్రంగం లో ఆఫీసర్ల పనితీరుపై ఫీడ్ బ్యాక్ బాగుంటుంది. భారీగా అధికారుల బదిలీల తరువాత డిపార్టుమెంట్ల వారీగా అనుకున్న స్థాయిలో పలితాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక శాఖలో బదిలీల తరువాత చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం లో ఏళ్ల తరబడి పనిచేసి రిటైర్ అయిన వాళ్ళ పరిస్థితి మొన్నటి వరకు అత్యంత దారుణంగా ఉండేది. కానీ ప్రస్తుతం కొత్త అధికారిగా సందీప్ కుమార్ సుల్తానియా వచ్చిన తరువాత ఉద్యోగులు , పెన్షనర్లు,కాంట్రాక్టర...

ప్రభుత్వనికి ఇబ్బందికరంగా ఆ మంత్రి వ్యవహార శైలీ.

ప్రభుత్వనికి ఇబ్బందికరంగా ఆ మంత్రి వ్యవహార శైలీ. మంత్రి తీరుపై కుల సంఘాల ఆగ్రహం. తమ వర్గాలకు ఎం చేయడం లేదంటూ ఆవేదన. ఎమ్మెల్యేలు , ఎంపీలు , ఎమెల్సీలకు తప్పని కమిషన్ తిప్పలు. ప్రజా పాలనలో మంత్రుల తీరుపై జుగుప్సాకరంగా చర్చ నడుస్తోంది.పదేళ్ల పాటు రాష్ట్రాన్నీ అధోగతి చేసిన వారి బాటలోనే ప్రస్తుతం కాంగ్రెస్ పాలనా నడుస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఖావో - ఖీలావో  అన్న నానుడి అంటుంచింతే కేవలం ఖావో అన్నదే నిజం అవుతుంది అంటున్నారు జనం. ఓట్లు వేసి తమకు మంచి చేస్తారని గెలిపించిన జనాలకు తీరా పవర్ లోకి వచ్చాక చుక్కలు చూపిస్తున్నారు.ఎవరికీ వారే యమునా తీరె అన్నట్లుగా తయారై సామాన్యులకు నరకం పరిచయం చేస్తున్నారు.ఎస్సి , ఎస్టీ సబ్ ప్లాన్ కోసం కేటాయించిన నిధులు విడుదల కావు. వివిధ అభివృద్ది పనుల నిమిత్తం ఉన్నదంతా అమ్మి ఖర్చు చేసి తరువాత బిల్లులు పెడితే డైరెక్ట్ గా కమిషన్ ఇస్తేనే బిల్లులు క్లియర్ అవుతాయఅంటున్నారట.ఆర్తిక శాఖ మంత్రికంటే అయన సతీమణిదే డిపార్ట్మెంట్ లో హావ నడుస్తున్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది.లేటెస్ట్  గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికార  పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గం...

తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో కొత్త అంశం.

Image
  తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో కొత్త అంశం.  బిఆర్ఎస్ పిరియడ్ లో ఒకలా కంగ్రెస్ పిరియడ్ లో మరోలా. అప్పుడు బీహార్ బ్యాచ్ అంటూ ఎద్దేవా.   ఇప్పుడు తమిళ బ్యాచ్ అంటూ విసుర్లు.              ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్న విమర్శల పర్వం ఎప్పుడు ఉండనే ఉంటుంది. గులాబీ పార్టీ పవర్లో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారుల్లో ఎక్కువ మంది బీహార్ వాళ్ళకే పదవులు అంటూ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ. ఇపుడు అదే ఆరోపణలను ఎదురుకొంటుంది. అదేదో సినిమాలో అప్పట్లో బుష్ ఇప్పట్లో ముషారఫ్ అన్నట్లు టీఆరెస్ ప్రభుత్వంలో బీహార్ బ్యాచ్ అన్న విమర్శలకు కౌంటర్ గా లేటెస్ట్ గా తమిళ బ్యాచ్ అన్న ప్రచారం తెర మీదకు వస్తుంది. ఒకే రాష్ట్రానికి చెందిన చాల మంది ఆఫీసర్లు అప్పట్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. సీఎస్ , కమర్షియల్ టాక్స్ , రెవెన్యూ , సిసిఎల్ఏ ఇరిగేషన్ , హెచ్ ఎం డీ ఏ లాంటి అత్యంత ప్రాధాన్యత గల పోస్టుల్లో మాజీ ముఖ్య మంత్రి కెసిఆర్ కూర్చోబెట్టారని తీవ్ర స్థాయిలో అప్పటి ప్రతి పక్ష ప్రస్తుత రూలింగ్ పార్టీ విమర్శలు చేసింది.పాత ప్రభుత్వ తరహాలోనే కాంగ్రెస్ కూడా తమిళనాడు కు చెందిన పలువురు ఆఫీ...

ప్రభుత్వంలో అధికారుల పనితీరుపై విమర్శలు

Image
                                        ప్రభుత్వంలో అధికారుల పనితీరుపై విమర్శలు                        పలువురు సీనియర్ ఐఏఎస్ ల వ్యవహార శైలిపై ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ                   ప్రాధాన్యత గలిగిన పోస్టుల్లో ఉన్న పని చేయడం లేదంటూ విమర్శలు         మొన్నటి వరకు జీహెచ్ ఎంసీ , సీఎంఓలో కీలకంగా ఉన్న ఆఫీసర్ల తీరుపై విమర్శలు  తెలంగాణ ప్రభుత్వంలో పని చేస్తున్న కొంతమంది అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి.బిఆర్ఎస్ పిరియడ్ లో లూప్ లైన్ లో ఉన్న ఆఫీసర్లకు కాంగ్రెస్ పవర్ లోకి రాగానే పెద్ద పీట వేస్తున్నారు.ఇందులో కొంతమంది అధికారులు రేవంత్ రెడ్డి స్పీడ్ కు అనుగుణంగా పని చేయకపోడంతో పాలనా పరమైన ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేసిన అదికారి పదుల సంఖ్యలో ఫైళ్లను పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం.తరువాత సెక్రెటరియేట్ కి బదిలీప...